సాహో మూవీకి లైన్‌‌ క్లియర్

సాహో మూవీకి లైన్‌‌ క్లియర్

‘సాహో’ విడుదలకు డేట్ దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో యాక్షన్ సన్నివేశాల కారణంగా సెన్సార్ ఇబ్బందులు తలెత్తాయంటూ ఇటీవల వచ్చిన వార్త అభిమానుల్ని కాస్త కంగారు పెట్టింది. కానీ అలాంటిదేమీ లేదు. ‘సాహో’కి లైన్ క్లియరైంది. సెన్సార్ సర్టిఫికెట్  వచ్చేసింది. దాన్ని బట్టి ఈ సినిమా మూడు గంటలకు కొన్ని నిమిషాలు తక్కువగా ఉంది. అంటే మామూలుగా దక్కే వినోదానికి అదనంగా మరికొంత దక్కనుందన్నమాట. ఇప్పటికే సినిమా కోసం  ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌‌ని ఇది సంతోషపెట్టే విషయమే. బడ్జెట్‌‌, అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ, భారీ కాస్టింగ్ అంటూ ప్రతి విషయంలోనూ రికార్డులు నమోదు చేసుకుంటూ పోతున్న ఈ మూవీ… ఓపెనింగ్స్,
కలెక్షన్స్ పరంగా కూడా పాత రికార్డులన్నిటినీ దాటేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.