దేశంలో మరో కొత్త పార్టీ.. జూన్ 11న ముహూర్తం పెట్టారా

దేశంలో మరో కొత్త పార్టీ.. జూన్ 11న ముహూర్తం పెట్టారా

దేశంలో మరో కొత్త పార్టీ రాబోతుంది.. అది కూడా ప్రాంతీయ పార్టీ కావటం విశేషం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన రాజస్థాన్ లో.. కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలెట్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి.

జూన్ 6వ తేదీన ఈ మేరకు బయటకు వస్తున్న వార్తలు.. దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. 2023 డిసెంబర్ లో రాజస్ధాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ కీలక నేత.. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సచిన్ పైలెట్.. కొత్త కుంపటి పెట్టుకుంటున్నట్లు వస్తున్న కథనాలు.. రాజస్థాన్ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. 

ఇప్పటికే కొత్త పార్టీపై సచిన్ పైలెట్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని.. జూన్ 11వ తేదీని అధికారికంగా ప్రకటిస్తారనే సమాచారం కలకలం రేపుతోంది. కొత్త పార్టీ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ పేరుతోపాటు.. రాజ్ జన సంఘర్ష పార్టీ అనే పేర్లను పరిశీలిస్తున్నారంట. 

జూన్ 11వ తేదీనే ఎందుకు అంటే.. ఆ రోజు తన తండ్రి రాజేష్ పైలెట్ చనిపోయిన రోజు.. ప్రతి ఏటా ఆ రోజు తన అభిమానులతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంలోనే కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు సచిన్ పైలెట్ వర్గం నుంచి వార్తలు వస్తున్నాయి. 

రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ పైలెట్.. డిప్యూటీ సీఎంగా కూడా పని చేశారు. కొన్నాళ్ల మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ తో ఉన్న విబేధాలతో.. ఇటీవలే పాదయాత్ర కూడా చేశారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సొంత పార్టీపై.. సీఎంపైనే తిరుగుబాటు చేశారు.

ఇప్పుడు కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు రావటం.. రాజస్థాన్ రాజకీయాలను హాట్ టాపిక్ చేశాయి.. నిజంగానే జూన్ 11వ తేదీన సచిన్ పైలెట్ కొత్త పార్టీ ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాలి. 

 

Also Read :