ట్రేడింగ్ పేరుతో మోసం.. రూ.3 కోట్లతో పరార్..

ట్రేడింగ్ పేరుతో మోసం.. రూ.3 కోట్లతో పరార్..

హైదరాబాద్ లో భారీ మోసం బయటపడింది. ట్రేడింగ్ పేరుతో లాభాలు చూపెడతామని అమాయకుల దగ్గర నుంచి కోట్లు వసూలు చేసి చివరకు టోపీ తిప్పేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలోని ఓ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ మహిళ నుంచి అధిక లాభాలు ఆశ చూపి ట్రేడింగ్ చేస్తాం ఇన్ వెస్ట్ చేయండని చెప్పి ఓ గ్యాంగ్ ఆమెను కోరింది. అధిక లాభాలకు ఆశ పడ్డ మహిళ సదరు వ్యక్తులను గుడ్డిగా నమ్మి రూ.3.16 కోట్లు విడతల వారిగా ఇచ్చింది.    

చివరకు తాను మోసపోయానని గ్రహించిన మహిళ సదరు వ్యక్తుల పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్లకు చెందిన వారిని అరెస్టు చేశారు. సైమా తమాని,  బ్రీజేష్ పటేల్, అరుశ్ పాండే, శంకర్ పాండేతో పాటు మరో నిందితుడిని అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు.