Sai Pallavi: రామాయన్ కోసం సాయి పల్లవికి భారీ రెమ్యురేషన్.. మూడు పార్ట్స్కి కలిపి అన్ని కోట్లా!

Sai Pallavi: రామాయన్ కోసం సాయి పల్లవికి భారీ రెమ్యురేషన్.. మూడు పార్ట్స్కి కలిపి అన్ని కోట్లా!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి(Nitesh Tiwari) రామాయన్(Ramayan) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో మూడు భాగాలుగా రానున్న ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్(Ranbir kapoor) కనిపిస్తుండగా.. సీతగా లేడీ పవర్ స్టార్ సాయి(Sai pallavi) పల్లవి కనిపించనున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ యష్(Yash) అలరించనున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. మూడు బాగాలకి కలిపి దాదాపు రూ.15 కోట్ల వరకు తీసుకోనుందట సాయి పల్లవి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సౌత్ బ్యూటీలలో ఈ రేంజ్ రెమ్యురేషన్ తీసుకుంటున్న స్టార్ గా సాయి పల్లవి రికార్డ్ క్రియేట్ చేసింది. మొన్నటివరకు త్రిష రూ.12 కోట్లతో టాప్ లో ఉండగా ఇప్పుడు ఆమెను దాటేసి టాప్ లో నిలిచింది సాయి పల్లవి. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక భారీగా అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటిభాగం 2025లో ప్రేక్షకుల ముందుకు రానునట్లు టాక్.

ఇక ఈ సినిమాతో పాటు నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తున్నారు సాయి పల్లవి. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానునట్లు సమాచారం.