ఇప్పుండతా ప్రభాస్ సలార్ మానియా నడుస్తుంది. 2023 డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటుగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటుగా దేశవ్యాప్తంగా బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. ఆర్టిసి క్రాస్రోడ్స్లోని సంధ్య 70MM , కూకట్పల్లిలోని విశ్వనాథ్ 70MMలో డిసెంబర్ 19నే బుకింగ్ లు మొదలవ్వగా ఈ రోజు అంటే డిసెంబర్ 20 నుంచి అన్ని థియేటర్లలో బుకింగ్ లు మొదలయ్యాయి. బుక్ మై షో వెబ్ సైట్ ఒకనోక టైమ్ లో సర్వర్ డౌన్ అని కూడా వచ్చింది. దీన్ని బట్టి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తు్న్నారో అర్థం చేసుకోవచ్చు. సలార్ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
King of nizam #Prabhas ??
— Prabhas Trends (@TrendsPrabhas) December 19, 2023
Queue line at RTC cross roads Sandhya 70MM theatre for #Salaar ??? ???#SalaarNizamBookings pic.twitter.com/mlHph01QUZ
ఇక సలార్ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. సలార్ బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా బెనిఫిట్ షోతో పాటు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం.. మల్టీప్లెక్స్లలో గరిష్టంగా రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా.. సాధారణ థియేటర్లలో రూ.65 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులుకు గానూ 40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
ప్రశాంత్నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటించింది. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మించారు. రెండు పార్ట్ లుగా వస్తో్న్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ సినిమాపైన విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి.