ఓల్డ్సిటీ వెలుగు : చెడు అలవాట్లకు బానిసై బాలుడి వెంట ఉండి దొంగతనాలు చేయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మైలార్ దేవ్ పల్లి లక్ష్మీగూడకు చెందిన సల్లంగుల శ్రీకాంత్ (23) అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడితో దొంగతనాలు చేయిస్తున్నాడు. అతడిని వెంటేసుకుని పార్క్ చేసి ఉన్న టూ వీలర్లు, ఆటోలను దొంగిలించేవాడు. గతేడాది డిసెంబర్ లో శ్రీరాం కాలనీ హనుమాన్ టెంపుల్హుండీలో ఉన్న రూ.70వేల నగదు కూడా కాజేశారు.
అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో శ్రీకాంత్ పహాడిషరీఫ్, కర్నూల్ టూ టౌన్ , మహబూబ్ నగర్ లలో పలు దొంగతనాలు చేశాడు. శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా, బాలుడిని జువైనల్ హెూంకు పంపించారు. 3 ఆటోలు, 4 టూ వీలర్ లు స్వాధీనం చేసుకున్నారు.
