సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్

సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చాడు. సల్లూభాయ్ అప్ కమింగ్ మూవీ టైగర్ 3 మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ  తాజాగా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న ఈద్ సందర్భంగా ఈ మూవీని విడుదల చేయనున్నట్టు తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో నిర్మిస్తున్న 50వ చిత్రం టైగర్ 3కి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు మనీష్ శర్మ ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నారు. ఎక్తా టైగర్, టైగర్ జిందా హే మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ చేయనున్నారు.ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. బ్లాక్ కలర్ షర్ట్ అండ్ ప్యాంట్‌లో ఉన్న కత్రినా కైఫ్‌తో కొన్ని ఫైట్ సీన్స్  చేస్తూ ఉండగా టీజర్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఆమెకు మరికొన్ని స్టంట్లను తెలియజేసేందుకు కొరియోగ్రాఫర్‌లు సూచనలు చేస్తూ ఉంటారు. చివర్లో కత్రినా పడుకున్న సల్మాన్ ఖాన్ లేపి తన  ప్రాక్టీస్ ను  ప్రారంభించమంటోంది. ఇందుకు సల్మాన్ స్పందిస్తూ.. టైగర్.. ఎల్లప్పుడూ సిద్ధమే అంటూ బదులిస్తాడు. కాగా నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ లింకును  సల్మాన్ ఖాన్  ట్విట్టర్ లో షేర్ చేశాడు.మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. 2023 ఈద్‌లో టైగర్3 మూవీని హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. 21 ఏప్రిల్ 2023న మీకు దగ్గర్లోని థియేటర్లలో మాత్రమే టైగర్ 3 సినిమాను చూడండి అంటూ  సల్మాన్ ఖాన్  పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తల కోసం

మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ

నాతో చర్చలకు రా.. పుతిన్​కు జెలెన్​స్కీ పిలుపు