సల్మాన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మెగాస్టార్

సల్మాన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మెగాస్టార్

హైదరాబాద్: తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఇద్దరు అగ్రహీరోలు కలసి స్క్రీన్ మీద షేర్ చేసుకుంటే చూడటానికి అభిమానులకు పండుగేనని చెప్పాలి. వచ్చే వారంలో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ అయితే టాలీవుడ్లో మరిన్ని మల్టీస్టారర్ మూవీలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. తెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ టాలీవుడ్ మూవీలో నటించనున్నాడు. ‘హనుమాన్ జంక్షన్’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ‘గాడ్ఫాదర్’ సినిమాతో సల్లూ భాయ్ తెలుగులో అరంగేట్రం చేయనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సెట్స్లో సల్మాన్ జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

‘గాడ్ఫాదర్ సెట్స్ లోకి సల్లూ భాయ్కు స్వాగతం. మీ రాక మా అందరికలో ఉత్సాహాన్ని పెంచింది. మాలో ఉత్సాహాన్ని నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లింది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో మీ ప్రెజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, గాడ్ఫాదర్కు మాతృక అయిన మలయాళం సినిమా ‘లూసిఫర్’. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో సల్మాన్ కనిపించనున్నాడని తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

ఝులన్ గోస్వామి కొత్త రికార్డు

స్టాఫ్​ అంతా.. ట్రాన్స్​జెండర్స్

పల్లెల్లో జాజిరి.. జాజిరి