నా ఆస్తి వందల కోట్లు.. నేను అప్పు చేయటం ఏంట్రా : సమంత ప్రస్టేషన్

నా ఆస్తి వందల కోట్లు.. నేను అప్పు చేయటం ఏంట్రా : సమంత ప్రస్టేషన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) రీసెంట్ గా తన మేకప్ ఆర్టిస్ట్,  ఫ్రెండ్ అనూషతో కలిసి బాలీ ట్రిప్ లో ఉన్న విషయం తెలిసందే.  అక్కడ నేచర్ ను ఎంజాయ్ చేస్తూ.. ట్రిప్ లో తన బ్యూటిఫుల్ ఫొటోస్ ను ఎప్పటికపుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కిక్కు ఇస్తుంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తను మయోసైటిస్‌ వ్యాధి నుంచి కోలుకునేందుకు అమెరికా వెళ్లనున్నారు. అందుకు కావల్సిన ట్రీట్ మెంట్ ఖర్చుకు రూ 25 కోట్ల ను..ఒక స్టార్ హీరో దగ్గర అప్పుగా తీసుకుందని సోషల్ మీడియా లో న్యూస్ వైరల్ అవుతోంది.

ఆ గాసిప్స్ కి సమంత తన ఇన్ స్టా స్టోరీస్ లో రియాక్ట్ అవుతూ. ఓ పోస్ట్ రాసుకొచ్చింది.. మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీతో తప్పుడు డీల్ ను కుదుర్చుకున్నారు. నేను అందులో అతి తక్కువ మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్ అనేది వేలాది మంది ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ అది. ధన్యవాదాలు.. అంటూ సమంత అసహనం వ్యక్తపరుస్తూ నోట్ లో పేర్కొన్నారు. దీంతో సామ్ ఫ్యాన్స్ కు తన నిజాయితీ..నిబద్దత పట్ల గౌరవం పెరిగిందని కామెంట్స్ పెడుతున్నారు. సామ్ ప్రస్తుతం సినిమాలకు విరామం తీసుకున్నది హెల్త్ కోసమనే అందరికీ తెలిసిన విషయమే. 

సామ్ నుంచి త్వరలో ఫీల్ గుడ్ మూవీ ఖుషి రిలీజ్ కు రెడీ గా ఉంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో చేసిన ఈ  క్లాసిక్ మూవీ నుంచి రిలీజైన అప్డేట్స్ తో అందరిని ఫిదా చేస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) తెరకెక్కిస్తున్న ఈ మూవీను మైత్రి మూవీ మేకర్స్(Mytri movie makers) నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్స్ అండ్ సాంగ్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఖుషీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

ఇక ఈ మూవీ తరువాత సమంత బాలీవుడ్ లో సిటాడెల్(Citadel) వెబ్ సిరీస్ చేస్తున్నారు. వరుణ్ ధావన్(Varun dhavan) హీరోగా చేస్తున్న ఈ సిరీస్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.