తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ.ఈవీవీ సినిమా బ్యానర్పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
తాజాగా ఈ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 10గా ఆయన పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఆర్యన్ రాజేష్, ఎన్.వి. కృష్ణారెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తుండగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ బాలాజీ, శ్రీ రంజని కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
