నీ బెస్ట్ చూశాను, నీ వరస్ట్ చూశాను.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

నీ బెస్ట్ చూశాను, నీ వరస్ట్ చూశాను.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో ఖుషి(Kushi) అనే లవ్ స్టొరీ చేస్తోంది. క్లాసిక్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్(Mytri movie makers) నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్స్ అండ్ సాంగ్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఖుషీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇక సమంత, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. ఈ షెడ్యుల్ లో విజయ్, సమంతలపై ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. షూటింగ్ గ్యాప్ లో విజయ్, సమంత ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త క్షణాల్లో వైరల్ గా మారాయి.

ఇక తాజాగా సమంత.. విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. విజయ్ తో కలిసి టర్కీలో లంచ్ చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ.. "నీ బెస్ట్ చూశాను, నీ వరస్ట్ చూశాను, నువ్వు లేట్ గా వచ్చినప్పుడు, ముందు వచ్చినప్పుడు చూశాను. నీ సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాను. కొంతమంది స్నేహితులు మన పక్కనే నిలబడతారు. ఖుషి షూటింగ్ మొదలు పెట్టి సంవత్సరం అవుతుంది. ఇది నా లైఫ్ లో అద్భుతమైన సంవత్సరం" అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ స్పెషల్ పోస్ట్ వైరల్ గా మారింది.