సమంతకు అస్వస్థత.. జ్వరంతో బాధపడ్తున్నట్టు ట్వీట్

సమంతకు అస్వస్థత.. జ్వరంతో బాధపడ్తున్నట్టు ట్వీట్

స్టార్ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యంది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేసింది. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన సమంత లేటెస్ట్ చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్, షూటింగ్స్,  తో బిజీ అయిన సమంత.. అస్వస్థతకు గురైనట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం తాను జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిపింది. గొంతు కూడా సరిగా రావడం లేదని రాసుకొచ్చింది. అంతే కాకుండా ఏప్రిల్ 12 బుధవారం రోజు సాయంత్రం జరగనున్న శాంకుతలం ప్రమోషన్స్ లో తాను పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంటో నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ .. సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తు్న్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో సమంతకు జోడీగా మళయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాలో నటిస్తుండడం మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని సమంత ఫ్యాన్స్ తో పాటు, మెగా అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పౌరాణిక రొమాంటిక్ డ్రామా 'కాళిదాసు' రచించిన ప్రముఖ నాటకం శకుంతల కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ.. 2డీతో పాటు 3డీలోనూ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

https://twitter.com/Samanthaprabhu2/status/1646075728449146882