మెహిదీపట్నం, వెలుగు: డ్యూటీకి రాని బల్దియా శానిటేషన్ కార్మికుల డూప్లికేట్ ఫింగర్ప్రింట్స్తో అటెండెన్స్ వేసిపైసలు కొట్టేస్తున్న ఎస్ఎఫ్ఏ(శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్)ను కుల్సుంపురా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై మక్సూద్ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ సంజయ్నగర్కు చెందిన ఉల్క నందకర్ సత్యనారాయణ(48) గోషామహల్ సర్కిల్–14లోని ఆగాపురాలో ఎస్ఎఫ్ఏగా పనిచేస్తున్నాడు.
శానిటేషన్ వర్కర్ల ఫింగర్ ప్రింట్లను సేకరించి, సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేశాడు. విధులకు రాని వర్కర్లను గుర్తించి వారి అటెండెన్స్ను సింథటిక్ ఫింగర్ప్రింట్స్ సాయంతో వేసేవాడు. ఇలా రోజు 5 నుంచి 8 మంది వర్కర్లకు అటెండెన్స్ను వేసి వారికి డైలీ వచ్చే రూ.200ను కాజేస్తున్నాడు. సమాచారం అందుకున్న కుల్సుంపురా పోలీసులు సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేశారు. 5 డూప్లికేట్ ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు.