శ్వాస కోశ సంబంధిత సమస్యతో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అత్యవసర ట్రీట్మెంట్ నిమిత్తం కరోనా టెస్ట్ చేయగా అందులో నెగిటీవ్ వచ్చినట్లు సంజయ్ దత్ ట్వీట్ చేశారు.
తన కొవిడ్ రిపోర్ట్ నెగెటివ్ వచ్చిందని.. ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని అభిమానులకు తెలిపాడు. మరో రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతానని క్లారిటీ ఇచ్చాడు సంజయ్. తన గురించి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సంజయ్ చివరిసారిగా పానిపట్ లో నటించారు. ఇందులో అహ్మద్ షా అబ్దాలి పాత్ర పోషించాడు. సంజయ్ దత్ ఇప్పుడు తన రాబోయే చిత్రం సడక్ – 2 విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా సినిమా విడుదలను వాయిదా వేసిన నిర్మాతలు…ఆ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు కన్నడస్టార్ యశ్ నటిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ – 2 లో సంజయ్ విలన్ అధీరా ప్రాతలో యాక్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.
గతంలో కేజీఎఫ్ -2 గురించి సంజయ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో అతను తన పాత్రను ఎవెంజర్స్ నుండి థానోస్తో పోల్చాడు. కేజీఎఫ్ -2 విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.