గవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నరు : సంజయ్ రౌత్

గవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నరు : సంజయ్ రౌత్

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు.  కోశ్యారీని గవర్నర్ గా గుర్తించటం లేదన్నారు. కోశ్యారీ మహారాష్ట్రను అహహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని  సంజయ్ రౌత్ మండిపడ్డారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని, రాజ్ భవన్ ను బీజేపీ హెడ్ క్వార్టర్ గా మార్చేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. రాష్ట్రంలో గవర్నర్ గౌరవం ముగిసిందని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ను ప్రపంచలోని మరే ఇతర వ్యక్తితోనూ పోల్చలేరన్నారు. 

మహారాష్ట్ర గవర్నర్‌ను బయటకు పంపాలన్న ఎన్‌సీపీ, శివసేన (షిండే గ్రూపు) నేతల డిమాండ్‌పై సంజయ్ రౌత్ స్పందించారు. ఇది కేవలం తమ భావన మాత్రమే కాదని అధికార ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అదే కోరుకుంటున్నారని కానీ బహిరంగంగా వ్యక్తం చేయడం లేదని సంజయ్ అన్నారు. ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడా యూనివర్సిటీలో శనివారం నిర్వహించని ఓ కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ పాల్లొన్నారు. ఈ సందర్బంగా ఆయన తన ప్రసంగంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఓల్డ్ ఐడల్ అని అన్నారు.