కర్నూలు జిల్లా : శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మల్లన్న ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయం మెరిసిపోతుంది. ఆదివారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశం చేసి… ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు దేవస్థానం ఈవో, ప్రధాన అర్చకులు.
ముక్కోటి దేవతలను, సకల సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబ సమేతంగా మల్లికార్జున స్వామి భృంగి వాహనంపై ఊరేగనున్నారు. ఆదివారం (12వ తేదీ) నుంచి శనివారం (18వతేదీ) వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
See Also: T20 ఉమెన్స్ వరల్డ్ కప్: భారత జట్టులో తెలంగాణ అమ్మాయి