సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చి అల్లుడు ఆత్మహత్య

సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చి అల్లుడు ఆత్మహత్య

సంక్రాంతి పండుగకు అత్తారింటికి వెళ్లిన అల్లుళ్లు ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అల్లుడికి మర్యాదలు చేస్తుంటారు అత్తారింటివారు.. ఎన్ని గొడవలున్నా పండుగపూట అన్ని మరిచి సంతోషంగా గడుపుతుంటారు. కానీ వికారాబాద్ లో ఇందుకు భిన్నంగా జరిగింది. పండుగకు అత్తగారింటికి వెళ్లి అల్లుడు అత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

ఏం జరిగిందంటే..

సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల క్రితం(జనవరి 13) దోమ మండలం గూడూరులోని తన అత్తగారింటికి వెళ్లాడు అంజయ్య(35). అయితే ఏం జరిగిందో తెలియదు గాని.. నిన్న(జనవరి 15) పుట్టాపహాడ్ కు చెందిన అంజయ్య గూడూరు శివారులోని అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు స్థానికులు.