నిజామాబాద్ /కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని నిజామాబాద్ డివిజన్లో సెకెండ్ ఫేజ్లో జరిగే గ్రామ పంచాయతీలకు తొలి రోజు ఆదివారం సర్పంచ్ స్థానాలకు 122 నామినేషన్లు, వార్డులకు 148 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎనిమిది మండలాలున్న డివిజన్లో మొత్తం 196 జీపీలు, 1,760 వార్డులు ఉన్నాయి. అందులో ధర్పల్లి మండలం సర్పంచ్ పదవులకు 15 నామినేషన్ లు, వార్డులకు 20, డిచ్పల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 20, వార్డులకు 25 నామినేషన్స్ అందాయి.
ఇందల్వాయి మండలంలో సర్పంచ్ పోస్టుకు 13, వార్డులకు 9, మాక్లూర్ మండలం నుంచి సర్పంచ్ స్థానాలకు 16, వార్డులకు 11 నామినేషన్లను ఆర్వోలు స్వీకరించారు. మొపాల్ మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా 13, వార్డు సభ్యులుగా 29 నామినేషన్లు వేశారు. నిజామాబాద్ రూరల్ నుంచి సర్పంచ్ పోస్టులకు 12, వార్డుల నుంచి 13 నామినేషన్లు అందాయి. సిరికొండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 16, వార్డులకు 17, జక్రాన్పల్లి మండలంలో సర్పంచ్ పదవులకు 17, వార్డులకు 24 నామినేషన్లు దాఖాలయ్యాయి.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే 7 మండలాల్లోని 197 పంచాయతీల్లో ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ అయ్యింది. గాంధారి మండలంలోని 31 గ్రామాలకు గాను సర్పంచ్కి 19, వార్డు మెంబర్లకు 23, లింగంపేట మండలంలోని 41 గ్రామాలకుగాను సర్పంచ్కి 8, వార్డు మెంబర్లకు 5, ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామాలకుగాను సర్పంచ్కి 12, వార్డు మెంబర్లకు 9, నాగిరెడ్డిపేట మండలంలోని 27 గ్రామాలకుగాను సర్పంచ్కి 14, వార్డు మెంబర్లకు 14, మహమ్మద్నగర్ మండలంలోని 13 గ్రామాలకుగాను సర్పంచ్కి 14, వార్డు మెంబర్లకు 11, నిజాంసాగర్ మండలంలోని 14 గ్రామాలకుగాను సర్పంచ్కి 4, వార్డు మెంబర్లకు 6, పిట్లం మండలంలోని 26 గ్రామాలకుగాను సర్పంచ్కి 10, వార్డు మెంబర్లకు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ మంగళవారం వరకు కొనసాగనుంది. మొత్తం సర్పంచ్ పదవికి 81 నామినేషన్లు, వార్డు మెంబర్ స్థానాలకు 74 నామినేషన్లు వచ్చాయి.
