పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం

పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం

పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని 32  గ్రామాల సర్పంచ్​లు ఎంపీడీవోకు బుధవారం వినతిపత్రం అందజేశారు. తమ పరిస్థితి దయనీయంగా మారిందని, ఆస్తులు అమ్ముకొని అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రావడంలేదని సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు, పంచాయతీ ట్రాక్టర్ల డీజిల్ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో కొన్ని గ్రామాల సర్పంచులు ఉన్నారని పేర్కొన్నారు. ఎస్టీవోలో జమ చేసిన చెక్కులపై ఉన్న ఫ్రీజింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  
- జగిత్యాల టౌన్, వెలుగు