
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా సాయి మోహన్ ఉబ్బర తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మాతలు. ఈ మూవీ రిలీజ్ డేట్ను బుధవారం ప్రకటించారు. ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్పై రాసిన ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్ హైలైట్గా నిలిచింది. గోదావరి నేపథ్యంలో వస్తున్న ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మహేష్, శ్రీమాన్, బాబీ, ప్రవీణ్ యండమూరి, దీపక్ ప్రిన్స్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.