
- ఈ నెల 20 వరకు దరఖాస్తులు
పద్మారావునగర్, వెలుగు: పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురికి స్కాలర్షిప్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రతినిధి సాయిబాబా మంగళవారం ప్రకటించారు. స్టూడెంట్లు, నిరుద్యోగులను ప్రోత్సాహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 99080 51617 నంబర్లో సంప్రదించాలని సూచించారు.