పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ ఒక్కడే ; సత్యవతి రాథోడ్

పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ ఒక్కడే ; సత్యవతి రాథోడ్

గూడూరు, వెలుగు :  రాష్ట్రంలోని పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కడే అని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బూత్​ కమిటీల సమన్వయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కేసీఆర్​ను మూడోసారి సీఎం  చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన బంధు, దళితబంధు, మైనార్టీ బంధు అందించిన నేత కేసీఆర్​ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్మెన్ బిందు, భరత్ కుమార్ రెడ్డి, ఖాసీం, లక్ష్మణ్ రావు, వీరన్న, కిషన్, సురెంర్, నర్సింహా నాయక్ పాల్గొన్నారు.