సావిత్రిబాయి పూలేతోనే.. మహిళల్లో చైతన్యం..చదువు చెప్పి ఉన్నత స్థానంలో ఉంచారు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సావిత్రిబాయి పూలేతోనే.. మహిళల్లో చైతన్యం..చదువు చెప్పి ఉన్నత స్థానంలో ఉంచారు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత సమాజంలో బహుజనులు చదువుకొని చైతన్యవంతులుగా మారారంటే అది సావిత్రి బాయి పూలే కృషితోనే అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ నేతలతో కలిసి శనివారం సాయంత్రం పంజాగుట్టలోని ఓ థియేటర్ లో పూలే సినిమా చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో.. మహిళలు చదువుకోవడం అంటే నేరంగా చూసే కాలంలో.. జ్యోతిబా పూలే తన భార్య సావిత్రి బాయిని చదివించడం గొప్ప విషయమన్నారు.

ఆమె చదువుకొని యావత్ మహిళా లోకాన్ని అక్షరభ్యాసం వైపు అడుగులు వేయించారని కొనియాడారు. నేడు బహుజన మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారంటే అది ఆనాడు సావిత్రి బాయి పూలే వేసిన బలమైన అక్షర పునాదులేనని చెప్పారు. 200 ఏండ్ల కింద జరిగిన కథను కండ్లకు కట్టినట్లు ఈ చిత్రాన్ని తెరెకెక్కించిన పూలే చిత్ర నిర్మాత, దర్శకులను ఆయన అభినందించారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతానని చెప్పారు.