
ముంబై : దేశంలోని రోడ్డు ప్రాజెక్టులకు రూ. 90 వేల కోట్ల మేర అప్పులు ఇచ్చినట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. మొత్తం అన్ని బ్యాంకులు రోడ్డు ప్రాజెక్టులకు ఇచ్చిన అప్పుల్లో ఇది 37 శాతానికి సమానమని అన్నారు. జూన్ నెలాఖరు దాకా ఎన్హెచ్ఏఐకు రూ. 35 వేల కోట్ల క్రెడిట్ గ్రాంట్ చేశామని తెలిపారు. వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అమలు కోసమే ఈ అప్పులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు ఎస్పీవీకి రూ. 5 వేల కోట్లు ముందు ఇచ్చామని, ఇటీవలే ఆ అప్పును రూ. 8 వేల కోట్లకు పెంచామని ఖారా చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్ సమీకరించిన మొత్తం ఫండ్స్లో సగం తామే సమకూర్చినట్లు వెల్లడించారు.