OTP ఉంటేనే ATM నుంచి డబ్బు

OTP ఉంటేనే ATM నుంచి డబ్బు

కస్టమర్ల ఆర్థిక లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాత్రి సమయాల్లో  ATMల నుంచి రూ.10 వేలకు పైగా డబ్బులు డ్రా చేయాలంటే  OTP నంబర్ ఎంటర్ చేయాల్సిందే. బ్యాంకు అకౌంట్ తో లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే నగదు తీసుకోడానికి అవకాశముంది. OTP ద్వారా క్యాష్ విత్ డ్రా సేవలు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ విధానం జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ATM సెంటర్ల దగ్గర మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగ పడుతుందంటున్నారు బ్యాంకు అధికారులు.