దుండగులను కఠినంగా  శిక్షించాలి : బక్కి వెంకటయ్య  

దుండగులను కఠినంగా  శిక్షించాలి : బక్కి వెంకటయ్య  
  •     ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య  

రామాయంపేట, వెలుగు : అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ , ఎస్టీ కమిషన్​ చైర్మన్​బక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని ఆర్.వెంకటాపూర్ చేరుకుని ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయులు విగ్రహాలను ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. 70 ఏళ్ల పాలనలో ఇంకా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్,  సంజీవ్, సాగర్, మల్లేశం, కిషన్ ఉన్నారు.