
సుప్రీంకోర్టు జడ్జిల ఆస్తుల వివరాలు అధికారిక వెబ్సైటులో పొందుపరచాలని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మర్చి 14న ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఏప్రిల్ 1న తీసుకున్న నిర్ణయం ప్రకారం 33 మంది సిట్టింగ్ జడ్జిలలో గాను 21 మందికి సంబందించిన ఆస్తుల వివరాలు ఇప్పటికే అఫీషియల్ వెబ్సైటులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. స్థిర, చరాస్తులు, గోల్డ్, షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్ వంటి వివరాలు వెబ్సైటులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా..జడ్జిల కుటుంబసభ్యులకు సంబందించిన ఆస్తుల వివరాలు కూడా వెబ్సైటులో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
న్యాయవ్యవస్థలో పారదర్శకత కోసం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ తమ ఆస్తులను ప్రకటించి, ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి అంగీకరించారు.మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉన్నప్పటికీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 21 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల ప్రకటనలను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవి స్వీకరించిన తర్వాత తమ సంపాదన పెరిగినప్పుడల్లా చీఫ్ జస్టిస్ ఎదుట తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని తెలిపింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ కి కూడా ఈ రూల్ వర్తిస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు.