
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్
ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్టల్స్లో చదువుకుంటున్న పిల్లలతో టాయిలెట్లు కడిగించాలన్న ఐఏఎస్ ఆఫీసర్అలుగు వర్షిణిపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ డిమాండ్ చేశారు. ఆమె ఎస్సీలను అవమానించడమే కాకుండా సామాజిక అసహనాన్ని రెచ్చగొట్టారని గురు వారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.
ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగ ణించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతా మన్నారు. ప్రభుత్వ హాస్టల్స్లో చదువుకుంటున్న పిల్లల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వర్షిణిపై ఛత్రినాక పోలీస్ స్టేషన్లో గత నెల 29, ఈ నెల 2న ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు. సదరు పోలీస్స్టేషన్హౌస్ఆఫీసర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీసీపీకి ఫిర్యాదు చేసినట్టు మహేశ్వర్ రాజ్తెలిపారు.