హైదరాబాద్, వెలుగు: స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో ఖాళీల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన షెడ్యూల్ రిలీజ్ చేశారు. మొత్తం 28 పోస్టులను డిప్యూటేషన్పై తీసుకోనున్నట్టు ప్రకటించా రు. దీనికి లోకల్ బాడీ, స్కూల్ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్లు అర్హులని తెలిపారు. శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఈ నెల11 నుంచి 17 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తా మని శ్రీదేవసేన చెప్పారు.
రెండేండ్లు డిప్యూటేషన్, పనితీరు బాగుంటే మరో ఏడాది పొడగించే అవకాశం ఉందన్నారు. అకాడమిక్ సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడీ ఉండాలని, 58 ఏండ్లలోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. దరఖాస్తులను https://schooledu.telangana.gov.in/ISMS వెబ్ సైట్ ద్వారా పంపించవచ్చని చెప్పారు.