మనిషికి పంది కిడ్నీ.. అమెరికా డాక్టర్ల రికార్డ్​

మనిషికి పంది కిడ్నీ.. అమెరికా డాక్టర్ల రికార్డ్​

జీవన్మృతుడైన ఓ వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని డాక్టర్లు అమర్చిన సంఘటన అమెరికాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బ్రెయిన్​డెడ్​ అయిన 57 ఏళ్ల వ్యక్తి శరీరంలో కుటుంబసభ్యుల అనుమతితో జులై 14న పంది కిడ్నీ అమర్చారు. 

ఈ ప్రయోగం విజయం కావడంతో రెండో రోజు నుంచి మూత్రం విడుదలవుతోంది. నెల రోజులుగా ఆ అవయవం బాగా పని చేస్తుండటంతో వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి పనే చేయగా పంది కిడ్నీ రెండు రోజులకు మించి పని చేయలేదని, ఇప్పుడు ఏకంగా నెల రోజులుగా పని చేయడం మిరాకిల్​ అంటున్నారు న్యూయార్క్​ వర్సిటీకి చెందిన ట్రాన్స్​ప్లాంట్​ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​ డాక్టర్​ రాబర్ట్​మాంట్గోమెరి. 

మనుషులకు జంతువుల అవయవాలు అమర్చడంలో ఇదో కీలక ముందడుగని వివరించారు. గతేడాది మేరీలాండ్​ వర్సిటీ వైద్యులు జన్యుమార్పిడి చేసి పంది గుండెను ఓ వ్యక్తికి అమర్చి చరిత్ర సృష్టించినా.. ఆ వ్యక్తి రెండు నెలలు మాత్రమే బతికాడు.