
మెహిదీపట్నం, వెలుగు: పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై వెళ్తున్న ఓ స్కార్పియోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ బైరి రాజు తెలిపిన ప్రకారం.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన జాహీద్ హుస్సేన్ తన స్కార్పియో వాహనంలో ఎక్స్ప్రెస్ వే పైనుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు.
పిల్లర్ నెంబర్ 110 సమీపంలో వాహనంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆయన వెంటనే వాహనం దిగాడు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.