Farm house case : ప్రభుత్వ అప్పీల్పై కొనసాగుతున్న వాదనలు

Farm house case : ప్రభుత్వ అప్పీల్పై కొనసాగుతున్న వాదనలు

హైదరాబాద్ : ఫాం హోస్ కేసుకు సంబంధించి సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై హైకోర్టులో రెండోరోజు విచారణ కొనసాగుతోంది. ప్రతిపాదిత నిందితుల తరఫు న్యాయవాది సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తున్నారు. క్రిమినల్ రిట్ అప్పీల్ పిటిషన్ విచారణ అర్హతపై ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఇలాంటి పిటిషన్లకు సంబంధించి పంజాబ్ హర్యానా కోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను సీతారామ్మూర్తి కోర్టుకు సమర్పించారు. క్రిమినల్ రిట్ అప్పీల్ పిటిషన్లను ఆయా కోర్టు డివిజన్ బెంచ్ లు పరిగణలోకి తీసుకోలేదన్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 

ఫాం హోస్ కేసులో ప్రభుత్వ రిట్ అప్పీలుపై గురువారం ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. లంచ్ బ్రేక్ అనంతరం రోహిత్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ వాదనలు కొనసాగించారు. తన క్లయింట్ కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కింది కోర్టు తీర్పు ఇచ్చిందని రోహిత్ రెడ్డి తరఫు లాయర్ ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. దాన్ని రద్దు చేసి సీబీఐకు అప్పగించడం సరికాదని అన్నారు. ప్రతిపాదిత నిందితుల తరఫున వాదనలు వినిపించిన సీతారామ్మూర్తి రిట్ అప్పీల్ పిటిషన్ అసలు మెయింటేనబుల్ కాదని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్పై రిట్ అప్పీల్కు అవకాశంలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రివిజన్ పిటిషన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.