అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. స్పీకర్ గా దళితులు ఉండటం బీర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. సభలో ఇంత రాద్దాంతం జరుగుతున్నా కేసీఆర్ సభకు ఎందుకు రారని ప్రశ్నించారు. స్పీకర్ మీరు అక్కడ కూర్చోవడం బీఆర్ఎస్ వారికి ఇష్టం లేదంటూ.. కేసీఆర్సభకు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని మంత్రి లక్ష్మణ్ అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ,ఎస్టీ ప్లాన్ నిధులు డైవర్షన్ అయ్యాయంటూ.. ఎస్సీలకు ఎవరు ఏం చేశారో ప్రజలందరికి తెలుసన్నారు. సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పై జరిగిన ఘటనలను పూర్తిగా ఆరాతీస్తున్నామన్నారు.
