వందేండ్ల వృద్ధురాలికి సెకండ్ డోస్ టీకా

వందేండ్ల వృద్ధురాలికి సెకండ్ డోస్ టీకా

కామారెడ్డి, వెలుగు : జిల్లా హాస్పిటల్​లో శనివారం వందేండ్ల వృద్ధురాలు సవుసాని లచ్చవ్వ కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ టీకా తీసుకున్నారు. రాజంపేట మండలం తలమడ్లకు చెందిన ఆమెకు వందేండ్లు దాటాయి. కొద్ది రోజుల కింద ఫస్ట్ డోస్ తీసుకోగా శనివారం సెకండ్ డోస్ కూడా తీసుకున్నారు. శతాధిక వృద్ధురాలితోపాటు ఇద్దరు బిడ్డలు నర్సవ్వ, సత్తవ్వ కూడా సెకండ్ డోస్ టీకా వేయించుకున్నారు.