సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ స్థాయి పతంగుల పండుగను తెలంగాణ ప్రభుత్వం గ్రాండ్గా నిర్వహించింది. టూరిస్ట్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న కైట్ ఫెస్టివల్ను మంగళవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తీరొక్క పతంగులతో పరేడ్ గ్రౌండ్ కలర్ఫుల్గా కనిపించింది. వివిధ ఆకారాలతో ఏర్పాటు చేసిన భారీ పతంగులు కనువిందు చేశాయి.
ఈ పండుగలో పలు రాష్ట్రాలతో పాటు ఫారెనర్స్ కూడా పాల్గొని విభిన్నమైన పతంగులను ప్రదర్శించారు. మరోవైపు జూబ్లీహిల్స్లోని రౌనక్ ఎస్టేట్లో ఆసఫ్జాహీ వంశానికి చెందిన 9వ నిజాం, నిజాం ఎస్టేట్స్ కస్టోడియన్ హిస్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ ఆద్వర్యంలో భోగి మంటలు వేసి సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. శిల్పారామంలో గంగిరెద్దులు, హరిదాసుల ప్రదర్శన ఆకట్టుకుంది.
