అన్ని రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

అన్ని రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసింది. RPF పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జైషే మహ్మద్ గ్రూప్ కు చెందిన మసూద్ అహ్మద్ పేరుతో నిన్న హర్యానాలోని రోహ్ తక్ రైల్వే పోలీసులకు ఒక లేఖ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో అక్టోబర్ 8న దాడులు జరుగుతాయని ఆ లేఖలో హెచ్చరించారు. దీంతో అన్ని స్టేషన్లను RPF డైరెక్టర్ అలర్ట్ చేశారు. రైల్వే స్టేషన్ల దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు.