ఈ- పంచాయతీ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షుడిగా కొనగాల మహేశ్

ఈ- పంచాయతీ ఆపరేటర్ల  గౌరవ అధ్యక్షుడిగా కొనగాల మహేశ్

కరీంనగర్, వెలుగు: తెలంగాణ ఈ–-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (టీఈపీసీఓఏ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ, డీపీఓ ఆఫీసుల్లో కీలకమైన గ్రామ పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో 2015 నుంచి1,579 మంది ఈ–-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

 ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లను కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లు నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వీరిని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ చానల్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్టు మహేశ్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈపీఓల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మహేశ్ వెల్లడించారు.