హైదరాబాద్, వెలుగు: సీనియర్ జర్నలిస్టు వై. నాగేశ్వరరావుకు ఓయూ డాక్టరేట్ దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఓయూ 83వ కాన్వొకేషన్లో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, అడోబ్ సంస్థ చైర్మన్, సీఈవో డాక్టర్ శంతన్ నారాయణ్ల చేతుల మీదుగా నాగేశ్వరరావు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
ఓయూ తెలుగు శాఖ ఆచార్యులు డి. చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ‘ఆధునిక తెలుగు సాహిత్యం– -లౌకికవాదం’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకుగాను నాగేశ్వరరావుకు డాక్టరేట్ను అందించారు. హైదరాబాద్ కేంద్రంగా 34 సంవత్సరాలుగా ఆయన జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్నారు.