సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావుకు ఓయూ డాక్టరేట్

సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావుకు ఓయూ డాక్టరేట్

హైదరాబాద్, వెలుగు: సీనియర్ జర్నలిస్టు వై. నాగేశ్వరరావుకు ఓయూ డాక్టరేట్ దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఓయూ 83వ కాన్వొకేషన్​లో  వైస్ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, అడోబ్ సంస్థ చైర్మన్, సీఈవో డాక్టర్ శంతన్  నారాయణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  చేతుల మీదుగా నాగేశ్వరరావు డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టాను అందుకున్నారు.  

ఓయూ తెలుగు శాఖ ఆచార్యులు డి. చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ‘ఆధునిక తెలుగు సాహిత్యం– -లౌకికవాదం’  అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకుగాను  నాగేశ్వరరావుకు డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించారు.  హైదరాబాద్  కేంద్రంగా 34  సంవత్సరాలుగా  ఆయన జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్నారు.