కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో శనివారం ఆర్కే కలెక్షన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్లియరెన్స్ సేల్లో ఉద్రిక్తత నెలకొంది. తక్కువ ధరకే వస్త్రాలు లభిస్తాయని మహిళలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.
నిర్వాహకులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారి తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులైన నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు
