కేసీఆర్కు నవాబులను మించి ఆస్తులు ఉన్నాయి: షబ్బీర్ అలీ

కేసీఆర్కు నవాబులను మించి ఆస్తులు  ఉన్నాయి: షబ్బీర్ అలీ

మొయినాబాద్ ఫాం హౌస్ కేసు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్, బీజేపీలు డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. 2014లో భైంసా ఎమ్మెల్యేను మొదటిసారి కొనుగోలు చేశారని విమర్శలు చేశారు. ఇప్పటివరకు 33 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. అలాగే.. మరో తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీలు ఇద్దరు దొంగలేనని షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. 

నిజాం నవాబులను మించి కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు ఉన్నాయని షబ్బీర్ అలీ చెప్పారు. స్వాధీనం చేసుకున్న 15 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. పట్టబడిన నలుగురు ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లాల్సింది పోయి.. ప్రగతి భనవ్ కు ఎలా తీసుకెళ్తారని మండిపడ్డారు. పోలీసుల తీరును తాను ఖండిస్తున్నానని అన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు అమ్ముడు పోవడం కొత్తేమి కాదని షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు.