Pathaan : విడుదలకు ముందే వసూళ్ల పర్వం

Pathaan : విడుదలకు ముందే వసూళ్ల పర్వం

విడుదలకు ముందే షారుక్ ఖాన్ పఠాన్‌ మూవీ వసూళ్ల పర్వాన్ని మొదలుపెట్టింది. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఇస్తున్నారు. కేవలం 5 గంటల్లోనే కోటి రూపాయల మేర టికెట్లు అమ్మడుపోయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పఠాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి (జనవరి 20) నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. మెట్రో నగరాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో ముందుగానే మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో 2 గంటల్లోనే 1800 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.  

నాలుగు సంవత్సరాల తరువాత షారుక్ ఖాన్ మూవీ వస్తు్ండటంతో పఠాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో షారుక్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.