శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రూ. 33 లక్షల బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రూ. 33 లక్షల బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి 552 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ప్రయాణికుడు ప్యాంట్ జేబులో దాచినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.33.53 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. అతడిపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.