
శంషాబాద్, వెలుగు: ఓ వ్యక్తి వద్ద ఎండీఎంఏ డ్రగ్పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్టారెంట్ సమీపంలో మంగళవారం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని తనిఖీ చేయగా 23 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్దొరికింది. విచారణలో ప్రకాశం జిల్లాకు చెందిన వట్టి జగదీశ్వర్ రెడ్డిగా తేల్చారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కొంతకాలంగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.
డ్రగ్తోపాటు ద్విచక్రవాహనం, ఫోన్స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ ఏఈఎస్ఏ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జగదీశ్వర్ రెడ్డిపై ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. డ్రగ్స్సరఫరాదారు బెంగళూరుకు చెందిన సైఫ్ షరీఫ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు.