జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతి శ్రీ పండిట్ 

జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతి శ్రీ పండిట్ 

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం శాంతి శ్రీ పండిట్ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ వీసీగా ఉన్న ఆమెకు జేఎన్యూ బాధ్యతలు అప్పగించింది. జేఎన్యూ వీసీగా మహిళా ప్రొఫెసర్ను నియమించడం ఇదే తొలిసారి. శాంతి శ్రీ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా ఉన్న ఎం. జగదీశ్ కుమార్ పదవీకాలం గతేడాది డిసెంబర్తో ముగిసింది. కొత్త వీసీ నియామకం వరకు తాత్కాలిక వీసీ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. తాజాగా జగదీశ్ కుమార్ యూజీసీ ఛైర్మన్ గా నియమితులవడంతో కేంద్రం శాంతి శ్రీని జేఎన్యూ వీసీగా నియమించింది.  

శాంతి శ్రీ పండిత్ ప్రస్తుతం ఫూలే విశ్వవిద్యాలయంలో పొలిటిక‌ల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె జేఎన్యూ నుంచి ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలు పొందారు. శాంతి శ్రీ 1988లో గోవా యూనివర్సిటీలో అధ్యాపక వృత్తి ప్రారంభించారు. 1993లో పూనే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యురాలిగా ఉన్న ఆమె.. సెంట్రల్ యూనివర్సిటీల విజిటర్ నామినీగా ఉన్నారు. జేఎన్‌యూ కొత్త వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ పండిట్‌కు యూజీసీ ఛైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ అభినందనలు తెలిపారు. 

శాంతి శ్రీ పండిట్ తండ్రి ధూళిపూడి ఆంజనేయులు. డి.ఏ.గా సుపరిచితులైన ఆయన ప్రముఖ ఇంగ్లిష్ జర్నలిస్ట్, రచయిత. చాలా తెలుగు రచనల్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. శాంతి శ్రీ తల్లి మూలమూది ఆదిలక్షి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్శిటీలో తెలుగు, తమిళం ప్రొఫెసర్గా పనిచేశారు.. శాంతి శ్రీ 1962లో రష్యాలోనే పుట్టారు. పుట్టిన 15 రోజులకే తల్లి చనిపోవడంతో రష్యా ప్రభుత్వం 16 నెలల పాటు పెంచి అనంతరం తండ్రికి అప్పగించింది. 18ఏళ్ల వయసులో ఆమె రష్యా సిటిజెన్షిప్ వదలుకున్నారు. శాంతి శ్రీ తండ్రికి దేశంలో అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ ఉండేది. 1998 డిసెంబర్లో ఆయన చనిపోయాక ఆమె ఆ లైబ్రరీని పూనేకు షిఫ్ట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ జిమ్మిక్కులు ప్రజలు నమ్మరు

ఘనంగా కొల్లి మల్లన్న జాతర