రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. తాను రాష్ట్రపతి రేసులో లేనని చెప్పారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్ ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి లేదని చెప్పారు. ఈ విషయంపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాష్ట్రపతి రేస్ నుంచి పవార్ వెనక్కి తగ్గడంతో విపక్షాలు డైలమాలో పడ్డాయి. ఓడిపోయే పోరులో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పలువురు విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో శివసేనకు చెందిన సంజయ్ పవార్ ను ఓడించి బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. స్వతంత్ర్య ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతు ఇస్తామని వాగ్దానం చేసి..చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థికి మద్ధతు తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకుంది.