Manamey Teaser: ఇద్దరిలో ఒకరే ఏడవండి..ఆసక్తిగా శర్వా మనమే టీజర్

Manamey Teaser: ఇద్దరిలో ఒకరే ఏడవండి..ఆసక్తిగా  శర్వా మనమే టీజర్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే(Manamey). దేవదాస్ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య(Sriram Adithya) తెరకెక్కిస్తున్న ఈ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో కృతి శెట్టి(Kriti shetty) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే టైటిల్ గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.టీజర్ ను చూస్తుంటే సినిమాను లండన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకేక్కించినట్లు తెలుస్తుంది. కాగా లండన్, యూరప్ లోనే సినిమా సాగుతుందని టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఇందులో హీరో,హీరోయిన్ లైఫ్ లోకి ఒక చిన్నపిల్లవాడు వస్తే ఏం జరుగుతుంది? ఇంతకీ ఆ బాబు కు హీరోకు ఏదైన సంబంధం ఉందా? బాబు ప్లాష్ బ్యాక్ ఏంటి అనే దాని పై సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది.

అలాగే, టీజర్ లో లండన్ బ్రిడ్జ్, థేమ్స్ నదిని కూడా ఇందులో చూడొచ్చు.క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టీజర్ చివరలో హీరోయిన్ కృతి శెట్టి పిల్లాడు ఏడుస్తుండు అంటూ హీరో మీద అరుస్తుంటే..ఇద్దరిలో ఒకరే ఏడవండి అంటూ శర్వా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఖుషీ, హాయ్ నాన్న ఫేమ్ హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యన కంప్లీట్ చేసుకుంది. ఇక నుంచి వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత  కాగా..కృతి ప్రసాద్ అండ్ ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

Also Read: తెలుగులో హారర్తో వస్తోన్న స‌న్నీ లియోన్..బోల్డ్ బ్యూటీకి భయపడతారా మరి!

శర్వానంద్ కి సరైన హిట్ వచ్చి చాలా కాలంగా అయింది. మహా సముద్రం,ఆడవాళ్ళు మీకు జోహార్లు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక జీవితం సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.అయితే, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ను ఇప్పటి వరకు శర్వానంద్ అందుకోలేకపోయారు.మరి క్లిన్ ఫ్యామిలీ సోల్ గా వస్తోన్న మనమే మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.