సనత్నగర్లో దారుణం.. అమవాస్య రోజున 8 ఏళ్ల బాలున్ని బలిచ్చింది

సనత్నగర్లో దారుణం..  అమవాస్య రోజున 8 ఏళ్ల బాలున్ని బలిచ్చింది

ప్రపంచం ఎంతో ముందుకు పోతున్నా మూఢనమ్మకాలు అనేవి ఇంకా మనుషుల్లో పోవడం లేదు. హైదరాబాద్ సనత్నగర్లోని  అల్లాదున్ కోటిలో మూఢనమ్మకాలతో ఓ బాలుడుని ఓ హిజ్రా  బలి ఇచ్చింది.  బలైన బాలుడిని 8 ఏళ్ల అబ్దుల్ వహీద్ గా గుర్తించారు.  అమవాస్య రోజున ఆ మహిళ ఆ బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. 

 బాలుడి మృతదేహం  మహిళ ఇంటి సమీపంలోని  ఓ నాలాలో గుర్తించారు. దీంతో మహిళ ఇంటిపై స్థానికులు దాడి చేశారు.  దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానాకి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.  ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.