ఏషియన్​ సంస్థలో మరో సినిమా ప్రకటించిన శేఖర్ కమ్ముల

ఏషియన్​ సంస్థలో మరో సినిమా ప్రకటించిన శేఖర్ కమ్ముల

ధనుష్(Danush), నాగార్జున(Nagarjuna) కాంబినేషన్‌‌‌‌లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekhar Kammula). శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పి బ్యానర్ (ఏషియన్​ గ్రూప్​)​పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్  మొదలైంది. గతంలో ఇదే సంస్థలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌‌‌‌ స్టోరీ’ సినిమాను తీసిన  శేఖర్ కమ్ముల, తాజాగా మరో సినిమాను  ఇదే బ్యానర్‌‌‌‌‌‌‌‌లో చేయబోతున్నారు. బుధవారం ఈ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హై బడ్జెట్, టాప్ క్లాస్ టెక్నికల్ వ్యాల్యూస్‌‌‌‌తో లార్జర్ దేన్ లైఫ్‌‌‌‌గా ఇది ఉండబోతోందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ తెలియజేశారు. ధనుష్‌‌‌‌ సినిమా పూర్తయ్యాక ఇది సెట్స్‌‌‌‌కి వెళ్లనుంది. ఇక ముంబై మాఫియా బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతున్న ధనుష్ సినిమాకు ‘ధారావి’ అనే టైటిల్‌‌‌‌ ప్రచారంలో ఉంది.