బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాకు వేధింపులు.. వీడియో విషయంలో వివాదం

బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాకు వేధింపులు.. వీడియో విషయంలో వివాదం

చంపేస్తామంటూ బెదిరింపులు, అత్యాచారం చేస్తామంటూ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ.. సినీ ఇండస్ట్రీ ఫైనాన్షియర్ పై కంప్లయింట్ చేసింది బాలీవుడ్.. హిందీ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి షెర్లిన్ చోప్రా. ఈ మేరకు  ఏప్రిల్ 13వ తేదీ ముంబై జూహూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. 

ఓ వీడియోలో నటించేందుకు డబ్బులు ఇస్తానంటూ సినీ నటి షెర్లిన్ చోప్రాతో ఒప్పందం చేసుకున్నాడు ఓ ఫైనాన్షియర్. ఈ వీడియో మేకింగ్ విషయంలో తలెత్తిన వివాదంతో.. ఆ ఒప్పందం నుంచి తప్పుకుంది షెర్లిన్ చోప్రా. దీంతో ఫైనాన్షియర్.. ఆ నటిని వేధించటం, బెదిరించటం మొదలుపెట్టాడు. వీడియోలో నటించకపోతే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయపడిన షెర్లిన్ చోప్రా పోలీసులకు కంప్లయింట్ చేసింది.

నటి ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా ఆ ఫైనాన్షియర్ పై ఐపీసీ సెక్షన్స్ 354, 506, 509 కింద కేసు నమోదు చేసిన ముంబై జూహూ పోలీసులు.. విచారణ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది.. ఎలాంటి వార్నింగ్స్ ఇచ్చాడు.. ఏ విధంగా వేధింపులకు గురి చేశాడు.. వారి మధ్య జరిగిన ఒప్పందం ఏంటీ.. ఎలాంటి కండీషన్స్ మధ్య లావాదేవీలు జరిగాయి అనే విషయాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు.