సంజయ్ రౌత్ కీలక కామెంట్

 సంజయ్ రౌత్ కీలక కామెంట్

జల్​గావ్: శివసేన(యూబీటీ) లీడర్ సంజయ్ రౌత్ కీలక కామెంట్లు చేశారు. రానున్న 15 నుంచి 20 రోజుల్లో మహారాష్ట్రలో షిండే సర్కార్ కూలిపోతుందని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్ గావ్​లో సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుత సీఎం, ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల్లో కూలిపోతుంది. ఇప్పటికే డెత్ వారెంట్ జారీ అయింది” అని ఆయన అన్నారు.